YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

నా తప్పుంటే ఎన్ కౌంటర్ చేయండి

నా తప్పుంటే ఎన్ కౌంటర్ చేయండి

నా తప్పుంటే ఎన్ కౌంటర్ చేయండి
కడప, డిసెంబర్ 12
ఏపీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్యకేసు విచారణలో సిట్ స్పీడ్ పెంచింది. అనుమానితులు, సాక్ష్యులతో పాటూ మరికొందర్ని విచారణకు పిలుస్తోంది. తాజాగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అంశాలపై సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. దాదాపు గంటన్నర పాటూ విచారణ సాగింది.వివేకా హత్యకేసులో భాగంగా తనను సిట్ అధికారులు విచారణకు పిలిచారని ఆదినారాయణరెడ్డి చెప్పారు. హత్య జరిగిన రోజు విజయవాడలో ఉన్నానని.. వివేకా హత్యకు నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పు ఉన్నవారిని తప్పకుండా శిక్షించాల్సిందేనన్న ఆయన.. వైఎస్ వివేకాను ఎవరు హత్య చేశారో అందరికీ తెలుసని బాంబ్ పేల్చారు.అప్పట్లో సీబీఐ కావాలని జగన్ హైకోర్టులో రిట్ వేశారని.. ఆయన సీఎం అయిన తర్వాత ఎందుకు సిట్ వేశారని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి అన్ని పార్టీలు సీబీఐ కావాలని కోరుతున్నాయన్నారు మాజీ మంత్రి. ఈ కేసులో తన ప్రమేయం ఉంటే ఎన్‌కౌంటర్ చేసుకోవచ్చని.. సీబీఐ విచారణ కావాలన్నదే తమ డిమాండ్ అన్నారు.ఈ కేసుకు సంబంధించి గతవారం సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి డ్రైవర్ దస్తగిరి, ప్రకాష్‌లను ప్రశ్నించారు. ఇద్దరి నుంచి వివరాలు సేకరించారు. మరికొందరు అనుమానితులు, సాక్ష్యుల్ని కూడా విచారణకు పిలుస్తున్నారు. ఆదినారాయణరెడ్డితో పాటూ మరికొందర్ని కూడా సిట్ అధికారులు ప్రశ్నించారు. మరికొంతమందిని కూడా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది.. టీడీపీ-వైఎస్సార్‌సీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. జగన్ సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు.. అప్పటి టీడీపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినా నిందితులు మాత్రం దొరకలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్తగా సిట్‌ను ఏర్పాటు చేశారు.

Related Posts