YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం

చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం

చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం
విజయవాడ, డిసెంబర్ 12, 
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఉదయం సభలోకి వస్తున్న సమయంలో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో బాబు ముఖ్యమంత్రి జగన్‌ను ఉన్మాది అని వ్యాఖ్యానించడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని లేకపోతే.. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై టీడీపీ అభ్యంతరం తెలిపింది.. సభ బయట జరిగిన విషయానికి క్షమాపణ చెప్పమనడం ఏంటని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఉరి తీయాలని అన్నారని గుర్తు చేశారు.టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. వైఎస్ బతినకున్నంత కాలం చంద్రబాబు తీరు ఒకలా ఉందని.. వైఎస్ చనిపోయాక చంద్రబాబు వైఖరిలో చాలా మార్పు వచ్చిందన్నారు. ఇక రాష్ట్రానికి నాయకుడ్ని తానే అని చంద్రబాబు భావించారని వ్యాఖ్యానించారు. తాను వైఎస్సార్‌సీపీలోకి వెళ్లి మంత్రి అవుతానని చంంద్రబాబుకే చెప్పానని.. నువ్వు వైసీపీలోకి వెళ్లినా.. ఆ పార్టీ ప్రభుత్వంలోకి రాదని చంద్రబాబు తనతో అన్నారని చెప్పుకొచ్చారు.ఇక చంద్రబాబు రాజధానిలో పర్యటించినప్పుడు చెప్పులు వేశారని.. తనకు గతంలో జరిగిన వైశ్రాయ్ సంఘటన గుర్తొచ్చిందన్నారు మంత్రి. ఇక ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదని.. జగన్ పిలిస్తే టీడీపీ 80శాతం ఖాళీ అవుతుందని.. తన గౌరవాన్ని చంద్రబాబు తగ్గించుకోవద్దన్నారు. ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని.. వెనక్కు తీసుకుంటే హుందాగా ఉంటుందన్నారు.ఇక చంద్రబాబు, టీడీపీ సభ్యుల వ్యాఖ్యలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్యే రోజా అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడితే తనను ఏడాదది పాటూ సస్పెండ్ చేశారని.. తనను సస్పెండ్ చేయడం సరికాదని సుప్రీంకోర్టు అప్పుడు చెప్పిందన్నారు. హైకోర్టు ఆర్డర్ ఉన్నా తనను లోపలికి రాకుండా చేశారని.. తనను ఈడ్చుకెళ్లారని గతంలో జరిగిన ఘటనల్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా.. పనికిమాలిన నాయకుడా అంటూ విరుచుకుపడ్డారు.

Related Posts