YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం తెలంగాణ

రైతు బకాయిలను వెంటేనే చెల్లించాలి

రైతు బకాయిలను వెంటేనే చెల్లించాలి

రైతు బకాయిలను వెంటేనే చెల్లించాలి
సిద్దిపేట డిసెంబర్ 12  
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని, ఉల్లిగడ్డ ధరలతో సహా నిత్యావసరాల వస్తువుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. రైతు బంధు పథకం కింద ఇంకా చాలా రైతులకు అందని ఖరీఫ్ సహాయాన్ని త్వరగా అందించాలని,తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం దుకాణాలకు పర్మిట్లు ఇవ్వడంతో మద్యం విచ్చలవిడిగా ఏరులై పారుతూ మద్యానికి బానిసలైన యువకులు మహిళలపై అత్యాచారాలకు  పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం తరఫున ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెంటనే బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Related Posts