తెరాస గ్రంధాలయాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ డిసెంబర్12,
తెలంగాణ భవన్ లో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రంథాలయంలోని పుస్తకాలను కేటీఆర్ పరిశీలించారు. అనంతరం ఇటీవలే మృతి చెందిన 27 మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేశారు కేటీఆర్. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.