YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రెండు వేల కోట్ల పైగా లోటు

రెండు వేల కోట్ల పైగా లోటు

రెండు వేల కోట్ల పైగా లోటు
గుంటూరు, డిసెంబర్ 13,
రాష్ట్ర ఆదాయంలో భారీ తగ్గుదల కనిపిస్తోంది. మొత్తం రావాల్సిన ఆదాయంలో 9.31 శాతం తగ్గినట్లు అధికారులు గుర్తించారు.  కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంటులోనే ఏకంగా 24 శాతానికి పైగా కోతలు ఉండగా, పన్నేతర ఆదాయంలో 35 శాతం లోటు కనిపించింది. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభకు సమర్పించిన నివేదికలో కూడా స్పష్టం చేసింది. ఒక సభ్యుడు అగిడిన ప్రశ్నకు సమాధానంగా ఆర్ధికశాఖ తయారు చేసిన నివేదికలో నవంబర్‌ వరకు ఉన్న ఆదాయం లోటును వివరించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లోనే ఎక్కువ లోటు ఉన్నట్లు గణాంకాల్లో ఆర్ధికశాఖ స్పష్టం చేసింది.తొలి ఆరు నెలలకు ఉన్న పరిస్థితి, నవంబర్‌ వరకు ఆదాయాన్ని విడివిడిగా చూపించిన ఆర్ధికశాఖ కొంతవరకు ఆర్ధిక పరిస్థితి ఇబ్బందికరంగానే ఉన్నట్లు గుర్తు చేసిరది. కేంద్ర గ్రాంట్ల విభాగంలో ఏకంగా 24 శాతానికిపైగా లోటు ఉన్నట్లు ఆర్ధికశాఖ తన నివేదికలో పేర్కొనడం విశేషం. అది కూడా గత ఏడాదికన్నా ఈ ఏడాది నవంబర్‌ వరకు నాలుగు వేల కోట్ల వరకు లోటు కనిపించిరది. గత ఏడాది రూ.14 వేల కోట్ల వరకు గ్రాంట్లుగా రాగా, ఈ ఏడాది కేవలం రూ.10 వేల కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా గత ఏడాది రూ.18,533 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.18,189 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అలాగే రాష్ట్ర సొంత పన్నుల విభాగంలో గత ఏడాది నవంబర్‌ వరకు రూ.28,584 కోట్లు రాగా, ఈ ఏడాది 26,465 మాత్రమే వచ్చింది. అంటే దాదాపు రెండు వేల కోట్లకుపైగా లోటు. ఇక కీలకమైన మద్యం ఆదాయ విభాగంలో 26 శాతం వరకు లోటు ఉందని ఆర్ధికశాఖ పేర్కొరది. అలాగే వృత్తి పన్ను విభాగంలోనూ 27 శాతం, నాలా పన్నుల్లో 26 శాతం ఆదాయం తగ్గినట్లు ప్రకటిరచిరది. ఇలా కేంద్ర, రాష్ట్ర ఆదాయాన్ని గణిస్తే మొత్తం 9.31 శాతం లోటు ఉందని పేర్కొంది

Related Posts