YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

మూడు కుటుంబాల్లో వివాహేతర విషాదం 

మూడు కుటుంబాల్లో వివాహేతర విషాదం 

మూడు కుటుంబాల్లో వివాహేతర విషాదం 
మెదక్, డిసెంబర్ 13  
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలు తీసింది. వివాహ బంధానికి చేటు తెస్తూ ప్రియుడితో వెళ్లిపోయిన మహిళ చివరికి అతడితో కలిసి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం నింపడంతో పాటు, వారి మధ్య తగాదా పెట్టింది. ఈ ఘటన మెదక్ జిల్లా చేర్యాల మండలం వీరన్నపేట జరిగింది.వీరన్నపేట గ్రామానికి చెందిన పొన్నబోయిన ప్రభాకర్‌‌కు ఏడేళ్ల క్రితం మద్దూరు మండలం కూటిగల్‌కు చెందిన అశ్వినితో వివాహమైంది. అశ్విని ఇంటికి ఆమె బంధువైన రామకృష్ణ అనే యువకుడు తరుచూ వస్తుండేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. రెండేళ్ల క్రితం వారిద్దరూ ఇంట్లోనే రాసలీలు కొనసాగిస్తున్న సమయంలో భర్త ప్రభాకర్‌ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీనిపై కులపెద్దల్లో పంచాయతీ పెట్టగా అందరూ అశ్విని, రామకృష్ణను మందలించారు. ఈ ఘటన తర్వాత రామకృష్ణ హైదరాబాద్‌ వచ్చి ప్లంబర్ పనిచేసుకుంటున్నాడు.ఈ నెల పదో తేదీన ఇంటికి వచ్చిన రామకృష్ణ ప్రియురాలు అశ్విని తీసుకుని వెళ్లిపోయాడు. దీంతో ఆమె భర్త చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే  గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద వారిద్దరూ విగజీవులుగా కనిపించారు. సంఘటనా స్థలంలో పురుగులమందు డబ్బా కనిపించడంతో వారు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఎస్ఐ మోహన్‌బాబు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేర్యాల ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇద్దరి మృతిపై రామకృష్ణ, అశ్విని కుటుంబాలు పరస్పర ఆరోపణలతో అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభాకర్ భార్యను అదుపులో పెట్టుకోకుండా తన కుమారుడి జీవితాన్ని నాశనం చేశాడని రామకృష్ణ తల్లిదండ్రులు ఆరోపించగా, తన భార్యను రామకృష్ణ మాయమాటలు చెప్పి తీసుకెళ్లి చంపేశాడని ప్రభాకర్ ఆరోపిస్తున్నాడు. అశ్విని చేతిపై గాట్లు ఉండటం. రామకృష్ణ ఎడమ చేతిపై గాయం ఉండటంతో వారిని ఎవరో హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు

Related Posts