YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ఏసీబీ వలలో వీఆర్వో సంగారెడ్డి

ఏసీబీ వలలో వీఆర్వో సంగారెడ్డి

ఏసీబీ వలలో వీఆర్వో
సంగారెడ్డి డిసెంబర్ 13
సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం తహశీల్దార్  కార్యాలయంలో రెండు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఒక వీఆర్వో ఏసీబీకి చిక్కిపోయాడు. గోల్కొండకు చెందిన జాకీర్ హుస్సేన్ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వీఆర్ఓ వెంకటయ్య వెలిమెల గ్రామంలో సర్వే నెంబరు 361 , 364 లకు సంబంధించిన భూ రికార్డుల కోసం ఆరు వేల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వీఆర్వో లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శుక్రవారం నాడు  రెండు వేల రూపాయలు లంచం ఇచ్చి వీఆర్వోను ఏసీబీకి పట్టించాడు. ఏసీబీ డిఎస్పీ రవికుమార్, ఇతర సిబ్బంది ఈ దాడిలో పాల్గోన్నారు.

<

Related Posts