అమరవీరులకు నివాళులు
న్యూఢిల్లీ డిసెంబర్ 13
2001లో పార్లమెంట్ పై జరిగిన దాడి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమరజవాన్లకు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. పార్లమెంట్ ఆవరణలోని స్మారక స్థూపం వద్ద ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోంశాఖ మంత్రి అమిత్షా, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్తోపాటు పలువురు నేతలు అమరజవాన్లకు నివాళులర్పించారు. 13 ఏళ్ల క్రితం లష్కరే యీ తాయిబా, జేషే ఈ హ్మద్ తీవ్రవాదులు పార్లమెంట్ కాంప్లెక్స్పై జరిపిన దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ మహిళా జవాన్, పార్లమెంట్ వార్డు సిబ్బంది సహా జర్నలిస్టు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఐదుగురు తీవ్రవాదులను భద్రతాదళాలు హతమార్చాయి.