YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

సమత హత్యాచారం కేసులో చార్జీషీటు దాఖలు

సమత హత్యాచారం కేసులో చార్జీషీటు దాఖలు

సమత హత్యాచారం కేసులో చార్జీషీటు దాఖలు
అదిలాబాద్, డిసెంబర్ 14, 
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన సమత అత్యాచారం, హత్య కేసులో పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. జిల్లా ఎస్పీ మల్లారెడ్డి శనివారం  ఉదయం ఆదిలాబాద్ ఫాస్ట్‌ ట్రాక్ కోర్టులో 140 పేజీల ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మొత్తం 44 మంది సాక్ష్యుల వాంగ్మూలతో ఛార్జ్‌షీట్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ అదనపు సెషన్స్, జిల్లా కోర్టును ఫాస్ట్ ట్రాక్ కోర్టుగా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసులో కేవలం 20 రోజుల్లో సమగ్ర దర్యాప్తు జరిపి ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు. ఫోరెన్సిక్ ఆధారాలు సహా, సమగ్ర వివరాలు కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. పోలీసుల తరఫు నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు.సమత హత్యాచార కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సోమవారం నుంచి రెగ్యులర్ విచారణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి భర్తకు ఇప్పటికే రెవెన్యూ శాఖలో అటెండర్‌గా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు సమత కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. సమతపై జరిగిన దారుణంతో మనస్తాపానికి గురైన ఆమె మేనమామ ఎల్లయ్య అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం ఎల్లపటార్‌లో నవంబర్ 24న ముగ్గురు కామాంధుల చేతిలో ఓ వివాహిత దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. ఈ ఘటనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆగ్రహజ్వాలకు పెల్లుబుకుతున్నాయి. గ్రామాల్లో సంచరిస్తూ బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగించే బాధితురాలు ఒంటరిగా ఉండటం గమనించి ముగ్గురు వ్యక్తులు అపహరించారు. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం గొంతు కోసి చంపేశారు.ఈ దారుణ హత్యోదంతం మరుసటి రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. చెట్ల పొదల్లో వివస్త్రగా ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో ఉమ్మడి ఆదిలాబాద్ భగ్గుమంది.ఎల్లపటార్ గ్రామానికి చెందిన షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముఖ్దుం ఈ కేసులో నిందితులుగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన 3 రోజుల్లోనే పోలీసులు వీరిని అరెస్టు చేశారు. నవంబర్ 24న సాయంత్రం ఒంటరిగా నడిచి వస్తున్న వివాహితను గమనించి బలవంతంగా చెట్ల పొదల్లోకి ఈడ్చుకెళ్లి దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు. నిందితులకు ఇప్పటికే నేర చరిత్ర ఉన్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.

Related Posts