YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఒకడు బాలికపై  హత్యాచారంచేస్తే   మరొకడు నీ శీలం చెడిపోయింది అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించాడు 

ఒకడు బాలికపై  హత్యాచారంచేస్తే   మరొకడు నీ శీలం చెడిపోయింది అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించాడు 

ఒకడు బాలికపై  హత్యాచారంచేస్తే   మరొకడు నీ శీలం చెడిపోయింది అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించాడు 

పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురాని చెందిన 14 ఏళ్ల బాలిక గుడిలో ఓ భజన కార్యక్రమానికి హాజరై తిరిగొస్తుండగా.. ఓ వ్యక్తి ఆమెను అడ్డగించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాధితురాలు జరిగిన సంఘటన గురించి తన ప్రియుడితో చెప్పింది. అయితే ఆమెకు అండగా నిలవాల్సిన అతను.. 'నీ శీలం చెడిపోయింది..' అంటూ అవమానించాడు. అంతేకాదు, ఇక నువ్వు బతికి లాభం లేదు.. చచ్చిపో అంటూ ఆత్మహత్యకు ప్రేరేపించాడు. అక్కడితో ఆగక కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఆమెతో తాగించాడు.దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె కన్నుమూయగా.. ఆలస్యంగా ఘటన వెలుగుచూసింది.వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా టి.నరసాపురానికి చెందిన 14 ఏళ్ల బాలిక కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన అబ్బాయితో ప్రేమలో ఉంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న ఆ బాలిక ఇటీవల గుడిలో భజన కార్యక్రమానికి హాజరై.. రాత్రిపూట ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. దీంతో మార్గమధ్యలో ఆమెను అడ్డుకున్న అదే గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి నిర్మానుష్య ప్రాంతంలోకి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. ఆపై అక్కడినుంచి పరారయ్యాడు. ఇంటికి చేరుకున్న బాలిక.. విషయం ఎవరికి చెప్పాలో తెలియక తనలో తానే కుమిలిపోయింది. చివరకు ప్రియుడు సుబ్రహ్మణ్యంతో విషయం చెప్పగా.. అతను ఆమెనే దూషించాడు.'నీ శీలం చెడిపోయింది..ఇక నువ్వు బతికి లాభం లేదు.. చచ్చిపో..' అంటూ అవమానించాడు. ఈ నెల 9న కూల్ డ్రింక్‌లో పురుగుల మందు కలిపి బాలికతో తాగించాడు. ఆపై స్కూల్‌కి వెళ్లిన ఆమె.. అక్కడే కళ్లు తిరిగి పడిపోయింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె కన్నుమూసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related Posts