YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ రివర్స్ వాక్ నిరసన

టీడీపీ రివర్స్ వాక్ నిరసన

టీడీపీ రివర్స్ వాక్ నిరసన
విజయవాడ, డిసెంబర్ 16, 
ఏపీ అసెంబ్లీ సమావేశాలు టీడీపీ వినూత్న నిరసన చేపట్టింది. సోమవారం రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై టీడీపీ వినూత్నంగా ఆందోళనలు చేపట్టింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు అధ్యక్షతన నిరసన చేపట్టారు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. వెనక్కి నడుస్తూ నిరసన తెలియజేశారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేశారు.రాష్ట్రంలో టెండర్లన్నీ రిజర్వు చేసుకుని రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అబద్దాలు చెబుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని.. రాష్ట్రంలో ఉన్మాది పాలన.. తుగ్లక్‌ పాలన నడుస్తోందని ఘాటు విమర్శలు చేశారు. పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని.. మనకు రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో రివర్స్ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అసెంబ్లీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. అసెంబ్లీలో 13 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ఎస్సీ కమిషన్ బిల్లు, ఎస్టీ కమిషన్ బిల్లు, ఎక్సైజ్ చట్టంలో సవరణలకు సంబందించి రెండు బిల్లులు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుతో పాటు మొత్తం 13 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే నూతన మద్యం విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజులుగా జరుగుతున్నాయి. రోజుకో అంశంపై టీడీపీ ఆందోళనలు చేపడుతోంది. ఉల్లిధరలు, రైతుల సమస్యలు, 2430 జీవో, ఆర్టీసీ ఛార్జీల పెంపు, రివర్స్ టెండరింగ్ ఇలా కీలకమైన అంశాలపై నిరసన తెలియజేసింది. రోజుకో విధంగా వినూత్న రీతిలో చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
ఆర్టీసీ బస్సులో ఎమ్మెల్యే
ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆర్టీసీ బస్సులో ప్రత్యక్షమయ్యారు. ఆర్డినరీ బస్సులో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నుంచి శివదేవుని చిక్కాల వరకు ప్రయాణికులతో కలిసి వెళ్లారు. ఇటీవల రాష్ట్రంలో పెంచిన ఆర్టీసీ ఛార్జీలపై ఆరా తీసేందుకు.. ప్రయాణికుల నుంచి అభిప్రాయాల నుంచి తెలుసుకునేందుకు ఆయన బస్సులో వెళ్లారు. పెంచిన ఛార్జీలు,పెరిగిన భారం గురించి ప్రయాణికులతో మాట్లాడి తెలుసుకున్నారు.అంతక ముందు ఎమ్మెల్యే రామానాయుడు పాలకొల్లు బస్టాండ్‌లో ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలతో ప్రజలపై రూ.వెయ్యి కోట్ల భారం పడుతుందని.. వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పల్లెవెలుగు బస్సు కనీస ఛార్జీలను 50 శాతం పెంచారని.. కొత్త ప్రభుత్వం వచ్చాక ఆరో నెలల్లోపే ఛార్జీలు పెంచడం దారుణమన్నారు.పాదయాత్ర సమయంలో జగన్ ఆర్టీసీ ఛార్జీలు పెంచమని చెప్పారని నిమ్మల గుర్తు చేశారు. ఇప్పుడు మాట తప్పరాని.. ఈ ఛార్జీల పెంపు విద్యార్థులు, పేదలపై కక్ష సాధింపని వ్యాఖ్యానించారు. మద్యం ధరలను పెంచేది మద్యం వినియోగదార్లను తగ్గించడానికే అని చెబుతున్న జగన్‌.. ఆర్టీసీ చార్జీలు పెంచేది ప్రయాణికులను తగ్గించడానికేనా అంటూ ప్రశ్నించారు.

Related Posts