కోల్కతాలో మమతా మెగా మార్చ్.. పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సీ) పై నిరసన
కోల్కతాలోని అంబేడ్కర్ విగ్రహం నుండి జొరసాంకో వరకు దాదాపు 7కి.మీ వరకు వేలాదిమంది కార్యకర్తలతో ఆమె ర్యాలీ నిర్వహించారు. కాగా, ఎన్ఆర్సీని బెంగాల్లో అమలుచేసే ప్రసక్తే లేదని ఇదివరకే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్ఆర్సీని మొట్టమొదట వ్యతిరేకించిన సీఎం మమతా బెనర్జీనే. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ నమోదు(ఎన్ఆర్సీ) చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్కతాలో 'మెగా మార్చ్' చేసారు. బెంగాల్ నుంచి ఏ ఒక్కరిని శరణార్థిగా బయటకు పంపించమని తెగేసి చెప్పారు.