YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే

క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే

క్యూలో నిల్చుని ఉల్లిపాయలు కొన్న మాజీ ఎమ్మెల్యే
విజయవాడ డిసెంబర్ 17 
విజయవాడ పాయకాపురం మోడల్ రైతు బజార్ ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ వినియోగదారులతో కలిసి ఉల్లిపాయల కోసం క్యూలో నిల్చున్నారు.  ఓ బస్తాను చేతపట్టుకుని క్యూలోనే తన వంతు వచ్చేవరకు నిల్చుని ఉల్లిపాయలు తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కిలో ఉల్లిపాయల కోసం గంట నుంచి రెండు గంటల పాటు నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. మహిళలు, పురుషులతో పాటు వృద్దులు ఇలా గంటలతరబడి క్యూలో నిల్చోడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వినియోగదారులతో కలిసి తాను క్యూలో నిలుచుని వారి ఇబ్బంది ఏ స్థాయిలో వుందో స్వయంగా అనుభవించానని అన్నారు.  నిత్యావసరాల కోసం ఇలా గంటలతరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొనడం పట్ల ఉమ ఆవేదన వ్యక్తం చేశారు.  వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నీరుగార్చిందని మండిపడ్డారు.  కిలో ఉల్లిపాయలు కోసం గంటల కొద్దీ నిరీక్షణ తప్పడం లేదని, ముఖ్యంగా రోజువారి కూలిపని చేసుకునే నిరుపేదలు రైతుబజార్ లోనే బారులు తీరాల్సి వస్తోందన్నారు. ఉల్లిని డిమాండ్ తగిన విధంగా సమకూర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, పేదల పనులు లేక పస్తులుంటున్నారని అన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల వేళ ప్రజలకు పాట్లు తప్పడం లేదని అన్నారు.టిడిపి ప్రభుత్వంలో అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తుచేశారు. క్రిస్మస్ ,రంజాన్ , సంక్రాంతి కానుకలు ఎత్తివేశారని... ఐదు రూపాయలకి ఆకలి తీర్చే అన్న క్యాంటిన్లు మూసివేశారని అన్నారు.  ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు కొనసాగించాలని, అలాగే ఉల్లిపాయలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని సరఫరా చేయాలని ఉమ ప్రభుత్వానికి సూచించారు.

Related Posts