ఆర్టీసీ ఉద్యోగ భద్రతపై జీవో విడుదల చేయాలి
హైదరాబాద్ డిసెంబర్ 17
ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండాలో వద్దో.. రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయించండి. ఉద్యోగ భద్రత పై జీవో విడుదల చేయాలి. గతంలో చనిపోయిన కార్మికుల పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ అశ్వత్థమా రెడ్డి అన్నారు. మంగళవారం నాడు ఖర్మన్ ఘాట్ లోని చంద్ర గార్డెన్ లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశం అయింది. ఈ భేటీకి అన్నిజిల్లాకు చెందిన యూనియన్ ప్రతినిధులు, కార్మికులు హజరయ్యారు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు రెండేండ్ల పాటు వాయిదా వేయడం, యూనియన్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయడంపై చర్చ జరిగింది. అశ్వత్థమా రెడ్డి మాట్లాడుతూ సమ్మె విరమణ తర్వాత అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి. అధికారుల మాటలు విని యూనియన్లకు వ్యతిరేకంగా సంతకాలు చేస్తే ఒకే.. లేదంటే వేధింపులేనని విమర్శించారు. సమ్మెకాలంలో ఆర్టీసీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని అయన అన్నారు.