YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు పర్యటనపై సమీక్ష

చంద్రబాబు పర్యటనపై సమీక్ష

చంద్రబాబు పర్యటనపై సమీక్ష
అనంతపురం డిసెంబర్ 17, 
వైసీపీ అరాచకాలపై ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడు బి.కె.పార్థసారథి అన్నారు.అనంతపురం జిల్లాలో రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే చంద్రబాబు పర్యటనపై సమీక్షించారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18న మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబు వచ్చి 20వ తేదీన సాయంత్రం వరకు అనంతపురంలో ఉంటారన్నారు. మాజీ ముఖ్యమంత్రిపై మంత్రులే రెచ్చగొట్టి మార్షల్స్‌ను ఉసిగొల్పడాన్ని ప్రజలంతా గమనించారన్నారు. జిల్లాలోని 14 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి స్థానిక ఎన్నికలకు సన్నద్ధం చేస్తారన్నారు. ప్రతి నియోజకవర్గంలోని శ్రేణులతో గంట సేపు సమీక్ష నిర్వహిస్తారన్నారు. ధర్మవరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి బాధ్యతలు ఎవరికైనా ఇచ్చారా అని విలేకరులు ప్రశ్నించగా అలాంటి ఏమి లేదన్నారు.

Related Posts