YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

అనుమానం తో కొట్టి చంపేశారు తిరువనంతపురం,

అనుమానం తో కొట్టి చంపేశారు తిరువనంతపురం,

అనుమానం తో కొట్టి చంపేశారు
తిరువనంతపురం, డిసెంబర్ 17
సెల్‌ఫోన్, పర్సు దొంగతనం చేశాడన్న నెపంలో కొందరు ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, నిప్పు పెట్టి చంపేసిన ఘటన కేరళ రాజధాని తిరువనంతపురంలో వెలుగుచూసింది. తిరువళ్లూమ్ జిల్లాకు చెందిన అజీష్(30) సోమవారం రాత్రి తాంపనూర్ ప్రాంతలోని బస్టాండ్‌కు వచ్చాడు. ఆ సమయంలో అక్కడే పడుకున్న ఓ వ్యక్తికి చెందిన సెల్‌ఫోన్, పర్సు దొంగలించాడంటూ ఏడుగురు వ్యక్తులు అతడిని పట్టుకున్నారు.తనకే పాపం తెలీదని ఎంత వేడుకున్నా వారంతా అజీష్‌ను చితకబాదారు. కత్తితో శరీరంపై గాట్లు పెడుతూ చిత్రహింసలకు గురిచేశారు. తర్వాత అతడి మర్మావయాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి వెళ్లిపోయారు. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అతడి శరీరం 40శాతం కాలిపోయిందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో తీసిన ఓ వ్యక్తి దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఇది పోలీసులకు చేరడంతో సమగ్ర దర్యాప్తు చేపట్టారు. వీడియో ఆధారంగా ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి.. మిగిలిన ఇద్దరి కోసం గాలిస్తున్నారు. అరెస్ట్ చేసిన వారిని నజీర్, దినేశ్, అరుణ్, సాజన్, రాబిన్‌సన్‌గా గుర్తించారు. నిందితుల్లో ఓ ఆటోడ్రైవర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు

Related Posts