YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే భావోద్వేగం

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే భావోద్వేగం

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే భావోద్వేగం
విజయవాడ, డిసెంబర్ 18, 
 టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. సోమవారం అసెంబ్లీలో మద్యపాన నిషేధంపై తాను చేసిన వ్యాఖ్యలపై ఇష్టం వచ్చినట్లుగా సోషల్ మీడియాలో విషపు రాతలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు.తన కుటుంబ సభ్యులు ఫోన్ చేసి.. అసెంబ్లీలో తాను తప్పు ఏం మాట్లాడలేదు అన్నారని భవాని గుర్తు చేశారు. అలాగే సోషల్ మీడియాలో నీచాతి నీచంగా పోస్టులు పెడుతున్నారని.. దీని గురించి తనకు బాధగా లేదని.. రాజకీయాల్లోకి పదవుల కోసం రాలేదన్నారు. చిన్నతనంలోనే తన తండ్రి, ఇటు తన మామగారు ఎన్నో పదవుల్లో ఉన్నారని.. పదవులు కొత్తేమీ కాదన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చానన్నారు.తన తండ్రి ఎర్రంనాయుడు ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చానన్నారు భవాని. తన కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని.. తాను కూడా పదిమందికి సేవ చేయగలిగితే చాలు అనుకున్నానని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులంతా తనను ప్రోత్సహించి రాజకీయాల్లోకి తీసుకొచ్చారని.. ఒకింత భావోద్వేగానికి గురయ్యారు.సోషల్ మీడియాలో తనపై రక, రకాల పోస్టులు పెట్టారని భవాని ఆవేదన వ్యక్తం చేశారు. ఆధారాలతో సహా తన దగ్గర ఉన్నాయని.. మూడు రోజుల క్రితం సీఎం మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడితే సహించేది లేదన్న వ్యాఖ్యల్ని గుర్తు చేశారు. ఓ ఎమ్మెల్యేగా తన పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ దిశ చట్టాన్ని.. ఈ పోస్టుల పెట్టిన వారిపై చర్యలు తీసుకొని.. తన దగ్గర నుంచి చర్యలు ప్రారంభించాలన్నారు టీడీపీ ఎమ్మెల్యే. ఈ పోస్టుల వెనుక ఎవరెవరు ఉన్నారో.. పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజానికి అందరం ఓ సందేశం పంపాలని.. అప్పుడే ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు భవాని.

Related Posts