జగన్ వి తుగ్లక్ చర్యలు
అమరావతి డిసెంబర్ 17
రాష్ట్రంలో మూడు రాజధానుల విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. మూడు చోట్ల రాజధానులుంటే ప్రజలు ఎక్కడికి పోవాలని అయన ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానివి తుగ్లక్ చర్యలని అయన మండిపడ్డారు. ఆరు నెలల ముందు ప్రారంభమైంది విధ్వంసం. ప్రజావేదిక కూల్చడంతో విధ్వంసానికి నాంది పలికింది ఈ ప్రభుత్వం. 7.43కోట్ల ప్రజావేదికను దుర్వినియోగం చేసారు. అవశేషాలు తీయకుండా ఏం చేయాలనుకుంటోందీ ప్రభుత్వం. అమరావతి మీద వైసీపికి కోపం ఎందుకని అయన అన్నారు. జగన్ లాగా అందరూ ఇష్టానుసారంగా తప్పుడు లెక్కలు రాయం. అమరావతి నిర్మాణం జరగకుండా చేయాలని వైసీపి ప్రభుత్వం చూస్తోందని అయన విమర్శించారు