YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

 దిశా నిందితుల నేరాల చిట్టా

 దిశా నిందితుల నేరాల చిట్టా

 దిశా నిందితుల నేరాల చిట్టా
హైద్రాబాద్, డిసెంబర్ 18
దిశ కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. దిశ హత్యాచార నిందితుల నేరాల చిట్టా భయం పుట్టిస్తోంది. దిశ హత్యకు ముందుకు మరో 9మందిని హత్య చేసినట్టుగా.. ఎన్‌కౌంటర్‌కు ముందు నిందితుల వాంగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. ప్రధానసూత్రధారి ఆరిఫ్‌ అలీ 6 హత్యలు.. చెన్నకేశవులు 3 హత్యలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌, కర్నాటక ప్రాంతాల్లోని హైవేల సమీపంలో ఈ హత్యలు చేసినట్టు నిందితులు అంగీకరించారని సమాచారం. ప్రతి ఘటనలోనూ మహిళలపై అత్యాచారం, హత్య చేసి.. మృతదేహాలను దహనం చేసినట్టు పోలీసుల ఎదుట నిందితులు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది.
దిశ కేసు నిందితుల వాంగ్మూలాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్లు చెప్పిన ప్రాంతాల్లో ఇప్పటి వరకు మొత్తం 15 సంఘటనలు జరిగినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాటన్నింటికి సంబంధించిన డీఎన్‌ఏ నివేదికలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే చాలా వాటిల్లో మృతదేహలు పూర్తిగా కాలిపోవడంతో.. డీఎన్‌ఏ పరీక్షల్లో సరైన ఫలితాలు రాలేదని సమాచారం. దీంతో శాస్త్రీయ పద్ధతుల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దిశ కేసు నిందితుల డీఎన్‌ఏతో 15 మంది మృతుల డీఎన్‌ఏలతో విశ్లేషిస్తున్నారు. దిశ కేసు చార్జిషీట్‌లో నిందితుల నేరాల చిట్టా పొందుపర్చే అవకాశం ఉంది.

Related Posts