పౌరసత్వ సవరణ చట్టంపై 'స్టే' ఇవ్వడానికి సుప్రీం నిరాకరించింది.
యితే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన 59 పిటిషన్లను విచారణకు స్వీకరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీం..జనవరి 22 లోపు కౌంటర్ దాఖలు చేయాలని కోరింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే నేత్రుత్వంలోని జస్టిస్ బీఆర్ గవాయ్,జస్టిస్ సూర్యకాంత్ పిటిషన్లను విచారించారుకాగా,పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్,తృణమూల్,ముస్లిం లీగ్ సహా పలు రాజకీయ పార్టీలు,సంస్థలు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చినవారికి భారత పౌరసత్వం కల్పించేందుకే ఈ చట్టం తీసుకొచ్చామని కేంద్రం చెబుతోంది. మరోవైపు విపక్షాలు మాత్రం కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికే ఈ చట్టం తీసుకొచ్చారని ఆరోపిస్తున్నాయి. శరణార్థులైన హిందువులు,బౌద్దులు,పార్శీలు,సిక్కు,క్రైస్తవులకు పౌరసత్వం కల్పించిన ప్రభుత్వం ముస్లింలను మాత్రం ఎందుకు మినహాయించిందని ప్రశ్నిస్తున్నారు.