YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

బీహార్‌లోని రొహ్‌తక్‌లో దారుణం

బీహార్‌లోని రొహ్‌తక్‌లో దారుణం

బీహార్‌లోని రొహ్‌తక్‌లో దారుణం ! బాలికపై అత్యాచారయత్నం... ప్రతిఘటించడంతో కాల్చి చంపిన కామాంధులు

బీహార్‌లో కామాంధులు రెచ్చిపోయారు. ఓ బాలికపై నలుగురు మృగాలు అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. బాలిక వారికి ఎదురు తిరిగింది. దీంతో ఆ అమ్మాయిపై కాల్పులు జరిపారు కామాంధులు. తమను ఎదిరించినందుకు కాల్పి చంపేశారు. బీహార్‌లోని రొహ్‌తక్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసలుు ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనపై నితీష్ సర్కార్‌పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని బీహార్ ప్రజలు మండిపోతున్నారు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలు కూడా బీహార్ సర్కార్‌ను నిలదీస్తున్నాయి. ఈఘటనకు ముందు ఇలాంటి తరహా ఘటనే కొన్నిరోజుల క్రితం బీహార్‌లో చోటు చేసుకుంది. ఇందులో అత్యాచారం చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ 23 ఏళ్ల యువతిని నిందితులు సజీవంగా దహనం చేశారు. ఈ దుర్ఘటనలో తీవ్రగాయాలపాలైన బాధితురాలు ఆస్పత్రిలో పదిరోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ప్రాణం విడిచింది.

Related Posts