YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

దిశా నిందితుల చరిత్ర..

దిశా నిందితుల చరిత్ర..

దిశా నిందితుల చరిత్ర..
హైద్రాబాద్, డిసెంబర్ 18 
వంబర్ చివరి వారంలో శంషాబాద్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సాయం చేస్తామని నమ్మించి.. వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం అందర్నీ కలచివేసింది. డిసెంబర్ 6న సీన్ రీ కన్‌స్ట్రక్షన్ సమయంలో.. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించగా.. కాల్పుల్లో హతమయ్యారు. దిశ నిందితులకు సంబంధించి.. పోలీసులు విస్మయం గొలిపే వాస్తవాలను వెల్లడించారు.తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లో దిశ ఘటన తరహాలోనే జరిగిన అత్యాచార ఘటనల గురించి సైబరాబాద్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న తర్వాత.. దిశ తరహాలోనే తెలంగాణ, కర్ణాటకల్లో హైవేల వెంబడి.. మహిళలను అత్యాచారం చేసి పెట్రోల్‌తో దహనం చేసిన 15 కేసుల విషయంలోనూ వారి ప్రమేయంపై పోలీసులు ప్రశ్నించారు. తాము 9 రేప్‌లు, మర్డర్‌లకు పాల్పడ్డామని అరీఫ్, చెన్నకేశవులు అంగీకరించారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మేం ఒక్కో కేసును వెరిఫై చేస్తున్నాం. సంఘటనలు జరిగిన ప్రాంతానికి బృందాలను పంపామని ఆ అధికారి చెప్పారు.ఎన్‌కౌంటర్‌పై విచారణకు రిటైర్డ్ జడ్జి వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్‌ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నేపథ్యంలో పోలీసులు వెల్లడించిన విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి.హైవే వెంబడి ఉన్న సంగారెడ్డి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లతోపాటు తెలంగాణ సరిహ్దదున ఉన్న కర్ణాటక పట్టణాల్లో అరీఫ్, చెన్నకేశవులు నేరాలకు పాల్పడినట్టు పోలీసులు టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు. 9 రేప్‌లు, నేరాలు జరిగిన సమయంలో వీరిద్దరూ ఎక్కడున్నారో తెలుసుకోవడం కోసం నిందితుల సెల్‌ఫోన్ టవర్ లొకేషన్లను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు.హైవేల వెంబడి వేశ్యలు, హిజ్రాలు సహా చాలా మంది మహిళలను వేధించామని అరీఫ్, చెన్నకేశవులు చెప్పారని పోలీసులు తెలిపారు. దిశ లాగే 9 మంది మహిళలను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టామని చెప్పారన్నారు. వెటర్నరీ డాక్టర్ హత్యాచారం కేసులో ఇప్పటికే ఫోరెన్సిక్ రిపోర్టులను తెచ్చుకున్న సైబరాబాద్ పోలీసులు.. పూర్తి నివేదికను త్వరలోనే సమర్పించనున్నారు.

Related Posts