YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 23న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

 23న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన

 23న స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన
కడప, డిసెంబర్ 18  
విభజన చట్టంలో పేర్కొన్న కడప స్టీల్ ప్లాంట్‌ ఏర్పాటుపై కేంద్రం విముఖత ప్రదర్శించడంతో రాష్ట్ర ప్రభుత్వమే దీనిని చేపట్టాలని నిర్ణయించింది. గతేడాది నాటి సీఎం చంద్రబాబునాయుడు మైలవరం వద్ద కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. అయితే, ప్రభుత్వం మారడంతో కడప స్టీల్ ప్లాంట్‌కు మళ్లీ భూమిపూజ నిర్వహించనున్నారు. డిసెంబరు 23న జమ్మలమడుగు మండల పరిధిలోని పెద్దదండ్లూరు, సున్నపురాళ్లపల్లె గ్రామాల మధ్యలో ఉక్కు పరిశ్రమకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందు కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌భార్గవ్‌, సీఎండీ మధుసూదన్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్‌ గౌతమితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు.రజత్‌భార్గవ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నందున ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ ద్వారా నిర్ణీత గడువులోపు పరిశ్రమ పనులు పూర్తిచేసి ఉక్కు ఉత్పత్తిని ప్రారంభిస్తామని వెల్లడించారు. డిసెంబరు 23న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను డిసెంబరు 20లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం సుమారు 3వేల ఎకరాలకు పైగా భూమిని ఏపీ హైగ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అప్పగించారు.స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్‌లో రూ. 250కోట్లు కేటాయించారు. ఇందుకోసం ఇనుప ఖనిజాన్ని ఎన్‌ఎండీసీ నుండిచిసరఫరా చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించింది. ఏపీ ప్రభుత్వం త్వరలో దీనిపై ఎంఓయు చేసుకోనుంది. సుమారు 20వేల మందికి ప్రత్యక్షంగా, 50వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసింది. ఈ ఉక్కు పరిశ్రమ కోసం జమ్మలమడుగు మండలం పెద్దగండ్లూరు, సున్నపురాళ్లపల్లి గ్రామాల్లో 3148.68 ఎకరాల ప్రభుత్వ భూమిని ముందస్తుగా ఉక్కు పరిశ్రమకు అప్పగించాలని రెవెన్యు శాఖ విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు.

Related Posts