రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ కేవలం అధికార పార్టీ కేనా! -సత్యం రెడ్డి పై అక్రమ కేసులు అన్యాయం- చేజర్ల
నెల్లూరు డిసెంబర్ 18
ఈ రాష్ట్రంలో అధికార పార్టీ వారికి మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని,ప్రతిపక్ష పార్టీలకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు.ఇటీవల ప్రభుత్వం అక్రమముగా కేసులు బనాయించగా బెయిలు పై విడుదల అయిన విడవలూరు మండల తెలుగుయువత అధ్యక్షుడు సత్యం రెడ్డి ని పరామర్శించి అనంతరం పత్రికా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర డిజిపి ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెపుతు న్నారని కానీ నిజానికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ వారికి మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని ప్రతిపక్ష పార్టీల కు భావ ప్రకటన స్వేచ్ఛ లేదని అయన అన్నారు. ప్రతిపక్ష పార్టీలు వారిని కించపరుస్తూ వైస్సార్సీపీ వారు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి పై ఎటువంటి కేసులు పెట్టకుండా,తెలుగుదేశం పార్టీ వారి పై మాత్రం కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు నుండి ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేద్దామనే ఆలోచన మానేసి, తెలుగుదేశం పార్టీ కార్యాకర్తలను ఏవిధంగా వేధించాలి, వారి పై ఎటువంటి అక్రమ కేసులు బనాయించాలి అనే దాని పై నే దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ వారిని వేధిస్తున్నారని అరోపించారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి పంచమర్తి అనురాధ, రాజమండ్రి శాసనసభ్యురాలు అదిరెడ్డి భవాని ల పై వైస్సార్సీపీ కార్యాకర్తలు అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినప్పటికీ ప్రభుత్వం వారి పై ఎటువంటి కేసులు పెట్టకుండా,కేవలం ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ పోస్టులు పెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై కేసులు పెడుతున్నారని విమర్శించారు.