మూడవ రాజధానికగా విశాఖ...హర్షం వ్యక్తం చేస్తున్న వైకాపా
విశాఖపట్నం డిసెంబర్ 18,:
విశాఖను మూడో రాజధానిగా ప్రకటించడంపై వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎం జగన్ సాహసోపేతంగా పరిపాలన వికేంధ్రీకరణ చేసేందుకు విశాఖను మూడో రాజధానిగా ప్రకటించారని విఎంఆర్ డిఏ చైర్మన్ ద్రోణం రాజు శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాంధ్రకు మహర్ధశ పట్టిందని చెప్పిన ఆయన ... జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆర్దిక అసమనతలు తొలగి అభివృద్ది వైపు అడుగులు వేస్తుందని అభిప్రాయపడ్డారు. గురువారం విశాఖ గురజాడ కళాక్షేత్రంలో ద్రోణంరాజు సత్యన్నారాయణ జయంతి సభ జరుగుతుందని, దీనికి మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పాల్గోంటున్నారని చెప్పారు.