మూడు రాజధానులపై టీడీపీ నిరసన
అమరావతి డిసెంబర్ 18, :
మంగళవారం శాసనసభలో సీఎం జగన్ మూడు చోట్ల రాజధానిపై గుంటూరు తెలుగుదేశం పార్టీ నిరసనకు దిగింది.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు లార్జి సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజధాని అమరావతిపై తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా అమరావతి శంకుస్థాపన చేశారు. అలాంటి రాజధానిపై వైస్సార్ పార్టీ నేతలు జిల్లాకో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని అన్నారు. ఇప్పటికే పనులు లేక కార్మికులు పస్థులతో పోడుకుంటున్నారు. అభివృద్ధికి కృషి చేస్తానని అధికారంలోకి వచ్చి... పథకాలను పూర్తిగా తొలగించె కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్న క్యాంటీన్ నుంచి రాజధాని వరకు పూర్తిగా తొలగిచాలని అధికారులకు సూచించారు. వికలాంగులు, వృద్ధులను కూడా వదలకుండా వారికి పింషన్లు, రెషన్ కార్డులు తొలగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, రైతుకూలీలు కార్మికులు పాల్గొన్నారు