YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

క్యాపిటల్ పై పేర్ని నాని మరో ట్విస్ట్

క్యాపిటల్ పై పేర్ని నాని మరో ట్విస్ట్

క్యాపిటల్ పై పేర్ని నాని మరో ట్విస్ట్
విజయవాడ, డిసెంబర్ 18,
రాజధానిపై జగన్ ఏం చెప్పారని ఇంత చర్చ జరుగుతోందని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. మూడు చోట్ల రాజధాని ఉండొచ్చని మాత్రమే జగన్ అన్నారని.. ఇక్కడైనా ఉండొచ్చు.. మరెక్కడైనా ఉండొచ్చని బాంబ్ పేల్చారు. సెక్రటేరియట్ ఎక్కడ ఉండాలనేది రిపోర్టులో ఉంటుందని.. ఒక చోట సెక్రటేరియెట్.. మరో చోట అసెంబ్లీ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. అంతా ఒక్క జిల్లాలోనే ఉండాలనే భావన కరెక్ట్ కాదని.. కమిటీ ఇచ్చే నివేదికలో అలా ఉండొచ్చు.. కావచ్చు అనే సీఎం అన్నారని గుర్తు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజధాని విషయంలో నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం చెప్పలేదంటున్నారు మంత్రి. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే ధైర్యంగా చెప్పే సత్తా జగన్‌కు ఉందని.. ప్రజాస్వామ్యవాదిగా అందరి అభిప్రాయాల మేరకే నిర్ణయాలు ఉంటాయన్నారు. నివేదికలో ఇలా ఉండొచ్చనే రీతిలో మాత్రమే సీఎం చెప్పారని.. ప్రజల ఆకాంక్ష మేరకు రిపోర్టు ఉంటుందని.. కానీ మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు.ఇక టీడీపీలో గంటా విశాఖలో, కేఈ కర్నూలులో ఉండాలని వ్యాఖ్యానించారని.. యనమల, నారాయణ మాత్రం అమరావతిలో ఉంటే బాగుంటుందని చెబుతున్నారని మంత్రి చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో భూములు కొన్నారని రాజధాని మార్చడం లేదని గుర్తు పెట్టుకోవాలన్నారు. రాజధాని పేరుతో భారీగా అక్రమాలు జరిగాయని.. అక్రమార్కులను గుర్తించి అవసరమైతే జైలుకు పంపుతామన్నారు మంత్రి.అమరావతిలో రైతుల్ని ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఎంతమంది.. రోడ్డెక్కిన రైతులు ఎంతమందో గమనించాలన్నారు. టీడీపీ ఒత్తిడితో కొందరు ఇలా ఆందోళనలు చేస్తున్నారని.. నిజమైన రైతులు రోడ్లపైకి రావడం లేదన్నారు. ఇక చంద్రబాబును నమ్మి మోసపోయిన రైతుల్ని జగన్ ఆదుకుంటారని.. ఆయన మాటిస్తే దానిపైనే నిలబడతారన్నారు

Related Posts