YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న సీఎం - బీజేపీ పురుషోత్తం రెడ్డి

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న సీఎం - బీజేపీ పురుషోత్తం రెడ్డి

ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న సీఎం
- బీజేపీ పురుషోత్తం రెడ్డి
కౌతాళం డిసెంబర్ 18 
ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి,బెల్ట్ షాపులు నిర్వహించి ప్రజలు దగ్గర నుంచి సొమ్మును కాజేస్తున్నారని బీజేపీ మంత్రాలయం ఇన్ ఛార్జ్ పురుషోత్తం రెడ్డి మండిపడ్డారు. బుదవారం మండల కేంద్రంలో పొదల కుంట మరెమ్మ అవ్వ ఉత్సవాలకు హాజరయ్యారు. భారీగా ర్యాలీ నిర్వహించి పార్టీ ని బలోపేతం చేయాలని కోరారు. అనంతరం అమ్మ వారిని దర్శించుకున్నారు. కౌతాళం లో అక్కం తోట దగ్గర పాత్రికేయులు సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం మద్యం నిషేదిస్తామని గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహించి కార్యకర్తలు కాసులు నింపుకుంటున్నారని ,ఇష్టానుసారంగా  ప్రతి గ్రామంలో 4, 5 బెల్టుషాపులు, కర్ణాటక మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని,ప్రజలకు జోబులు కలిచేస్తున్నారని మండి పడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి చేరుస్తామని చెప్పి ప్రజల పింఛన్లు ఎగ్గొట్టారని ఇది ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.వీరి వెంటకిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, మండల అధ్యక్షులు, సత్యనారాయణ రెడ్డి, యాంకన్న, మరియు కార్యకర్తలు లింగన్న, రామచంద్ర,జల్వడి బిముడు తదితరులు పాల్గొన్నారు.

Related Posts