YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎంపీ ఇంట్లో ఉపరాష్ట్రపతి పాదరక్షలు పోయాయ్‌

ఎంపీ ఇంట్లో ఉపరాష్ట్రపతి పాదరక్షలు పోయాయ్‌

గుడికి వెళ్లినప్పుడు చెప్పులు పోవడం సర్వసాధారణమే. మనకైతే ఇది సామాన్యమైన విషయమే.. మరి నిత్యం ఎంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఉపరాష్ట్రపతికి ఇలాంటి సందర్భం ఎదురైతే.. కాస్త ఆశ్చర్యపడాల్సిన విషయమే కదా. ఇప్పుడు అదే జరిగింది. అది కూడా ఎక్కడో గుడిలో కాదు.. ఓ ఎంపీ ఇంట్లో..

కొన్ని అధికారిక కార్యక్రమాల నిమిత్తం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నేడు బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు, భాజపా కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు పార్టీ ఎంపీ పీసీ మోహన్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటన్నర పాటు గడిపిన వెంకయ్యనాయుడు.. తిరిగి వెళ్లేందుకు ఇంటి బయటకు రాగా.. ఆయన పాదరక్షలు కనబడలేదు. సిబ్బంది, ఇతర వ్యక్తులు ఎంత వెతికినా దొరకలేదు. దీంతో వెంకయ్యనాయుడు భద్రతాసిబ్బంది సమీపంలోని చెప్పుల దుకాణానికి వెళ్లి మరో జత పాదరక్షలు తీసుకొచ్చారు. ఉపరాష్ట్రపతిని కలిసేందుకు చాలా మంది ఎంపీ నివాసానికి వచ్చారు. ఈ క్రమంలో ఎవరైనా తమ పాదరక్షలుగా భావించి ఉపరాష్ట్రపతి బూట్లు వేసుకెళ్లి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

Related Posts