YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అరుణ్... మరో కామపిశాచి

అరుణ్... మరో కామపిశాచి

అరుణ్... మరో కామపిశాచి
మెదక్, డిసెంబర్ 19
 రాష్ట్రంలో ఇటీవల మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ‘దిశ’ హత్యచార నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాత కూడా అబలపై అత్యాచారాల ఘటనలు కోకొల్లలుగా బయటపడుతున్నాయి. తాజాగా ఓ నరరూప రాక్షసుడి ఘోరాలు బయటకు రావడంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. మెదక్‌జిల్లా రామాయంపేట కొత్త చెరువులో ఈనెల 13న దొరికిన గుర్తుతెలియని మహిళ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకిచ్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిజామాబాద్‌ వినాయకనగర్‌కు చెందిన మహిళ భర్త జైల్లో ఉండటంతో అతడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఓ నేరగాడితో పరిచయమైంది. తాను దోచుకున్న బంగారం, డబ్బును చెరువుగట్టు మీద దాచాను, వాటిని తెచ్చుకుందామంటూ ఆమెను నమ్మించి తీసుకెళ్లిన ఆ కామాంధుడు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాను చేసిన ఘాతుకం బయటపడుతుందనే ఉద్దేశంతో గొంతు నులిమి చంపేశాడు.ముందుగా గుర్తుతెలియని మహిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు లోతుగా దర్యాప్తు చేపట్టేసరికి షాకిచ్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడిని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన నీరడి అరుణ్‌కుమార్‌గా తేల్చారు. అతడు అప్పటికే పలు హత్యలు, దొంగతనాల కేసులపై చంచల్‌గూడ జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి తన స్నేహితుడికి ష్యూరిటీ ఇచ్చి నిబంధనలు పాటించకపోవడంతో కామారెడ్డి పోలీసులు కేసు పెట్టారు. దీంతో అతడు భార్యతో కలిసి ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. వారికి సాయం చేస్తానంటూ నమ్మించిన అరుణ్ కొద్దిరోజులు తనవెంట తిప్పుకున్నాడు. ఈలోగా గడువు ముగియడంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.ఈ విషయాన్ని గ్రహించిన అరుణ్‌ అతడి భార్యతో చనువు పెంచుకున్నాడు. ఆమెను లోబరచుకోడానికి రకరకాల వస్తువులు కొనిచ్చేవాడు. భర్తకు బెయిల్‌ ఇప్పిస్తానని ఆశపెట్టి.. తాను దొంగిలించిన సొమ్ము ఒకచోట దాచిపెట్టానని దాన్ని తీసుకొద్దామని ఈ నెల 5వ తేదీన స్కూటీపై నిజామాబాద్‌ నుంచి రామాయంపేటకు తీసుకొచ్చాడు. రాత్రి 7.30 సమయంలో ఆమెను కొత్తచెరువు గట్టుకు తీసుకెళ్లి ఆమెను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు ఈ విషయాన్ని ఎవరికైనా చెబుతుందేమోనని గొంతు నులిచి చంపేసి పారిపోయాడు. హైదరాబాద్‌ పోలీసులకు పట్టుబట్టాడు. విచారణలో అరుణ్ చెప్పిన విషయాలు విని పోలీసులు షాకయ్యారు. దీంతో బుధవారం ప్రెస్‌మీట్ పెట్టి అతడి నేరాల చిట్టా మీడియాకు వివరించారు. 2018లో హైదరాబాద్‌ తిరుమలగిరిలోని ఓ ఇంట్లో కేర్‌ టేకర్‌గా పనిచేస్తూ ఆ ఇంటి యజమానురాలైన వృద్ధురాలిని హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లాడు. 2016లో అరుణ్‌ మరో ఇద్దరితో కలిసి ఒక ఆటో డ్రైవరును హత్యచేసి ఆటో ఎత్తుకెళ్లాడు. ఇదే కేసులో జైలుకెళ్లి అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో చేరి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కేసులో మూడేళ్ల శిక్ష పడగా బెయిల్‌పై బయటికి వచ్చాడు. నిజామాబాద్‌, ముథోల్‌, ఆర్మూర్‌ మండలాలకు చెందిన ముగ్గురు మహిళలను పెళ్లాడాడు. అతడి బాధలు భరించలేక ఇద్దరు భార్యలు వదిలేయగా.. ఈ విషయాన్ని దాచిపెట్టి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు.

Related Posts