YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విద్య-ఉపాధి ఆంధ్ర ప్రదేశ్

ముస్లీంలకు అండగా వైకాపా

ముస్లీంలకు అండగా వైకాపా

ముస్లీంలకు అండగా వైకాపా
విజయవాడ డిసెంబర్ 19, 
వారం నుంచి ఎన్నార్సీ గురించి ముస్లిం వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆందోళనలు చేస్తున్నారు. వాటిని గమనించాం. వైఎస్సార్సీపీ నుంచి, ఉప ముఖ్యమంత్రిగా నేను స్పష్టంగా చెప్తున్నా. వైఎస్సార్సీపీ ముస్లింల పక్షంగా నిలుస్తుందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు.  గురువారం నాడు అంజాద్ బాష, గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా, కర్నూల్ ఎమ్మెల్యే హఫీజ్, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషాలు మీడియాతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ వైఎస్సార్ ముస్లిమ్ మైనారిటీలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు. తండ్రిని మించి మైనారిటీలకు జగన్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నన్ను డిప్యూటీ సీఎం చేశారు. 2019లో 5 మందికి టికెట్స్ ఇచ్చారు. ఇక్బాల్  ఓడినా ఎమ్మెల్సీ చేశారని అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో చారిత్రక నిర్ణయం చేశారు. 50 శాతం రిజర్వేషన్ల చట్టం చేసి మాకు న్యాయం చేశారు. నారా హమారా మీటింగులో మైనారిటీల పై దేశద్రోహం కేసు పెడితే సీఎం ఎత్తివేశారు. హజ్ యాత్రకు వెళ్లే హాజీలకు 60 వేల రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టారు. ఇమామ్, మౌజూమ్ లకు మార్చి 1 నుంచి 15 వేల గౌరవ వేతనం ఇవ్వబోతున్నాం. వక్ఫ్ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మదరసా పిల్లలకూ అమ్మఒడికి సీఎం ఒప్పుకున్నారు. ఎన్నార్సీ పై ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్ళాం. వైఎస్సార్ కాంగ్రెస్ ముస్లింల వెనుక ఉంటుందని ఆయన చెప్పారని తెలిపారు. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. ఏ అన్యాయం జరిగినా మేము వ్యతిరేకిస్తామని సీఎం చెప్పారు. ఎక్కడ ముస్లిం లకు అన్యాయం జరిగినా పోరాటంలో మేము ముందుంటాం. రాజ్యసభ, లోక్ సభలోనూ ప్రొటెస్ట్ చేస్తామని అన్నారు.

Related Posts