రాజధానులపై స్పష్టత ఇవ్వాలి
విశాఖపట్నం డిసెంబర్ 19,
పాలనాపరంగా అభివృద్ధి, పాలన ఏకీకృతం గానే వికేంధ్రీకరణ జరగాలని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటన ఒక రాజకీయ గందరగోళంగా ఉందని , దీని పైన ఒక స్పష్టత ఇవ్వాలని కోరారు. రాజధాని కోసం అమరావతి పరిసర ప్రాంతాల్లో రైతులు ఇచ్చిన భూములను ఏం చేస్తారని ప్రశ్నించారు.విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటెల్ గా ప్రకటించిన నేపద్యంలో ఏలాంటి నిర్మాణాలు చేపడతారో చెప్పాలని కోరారు.అసెంబ్లీ సెక్రటేరియట్ అనేవి ఒకే చోట ఉంటేనే పాలనా పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని అన్నారు. రాజధాని నిర్ణయం అనేది వ్యక్తిగత నిర్ణయాలపై ఆధారపడకూడదని,ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉండాలని అన్నారు. గతంలో కూడా అందరి అభిప్రాయాలు తీసుకోకుండానే రాజధాని నిర్ణయం జరిగిందని,ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అలాగే వ్యవహరిస్తున్నారని అన్నారు.