విశాఖలో గవర్నర్ పర్యటన
విశాఖపట్నం డిసెంబర్ 19
ఏపీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశాఖలో పర్యటించారు. వుడా పార్కులో జరుగుతున్న 57వ జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీలకు హాజరై క్రీడలో పాల్గోన్న ఆటగాళ్లను అభినందించారు. అన్నీ రాష్ట్రాల నుంచి 3,500 మంది క్రీడాకారులు ఈ ఆట పోటీల్లో పాల్గోన్నారు. క్రీడాకారులతో పాటుగా చిన్నారులు కూడా ఈ స్కేటింగ్ క్రీడల పోటీలకు హాజరయ్యారు. నేటి తరం విద్యార్ధులు క్రీడలపై కూడా ఆశక్తి చూపాల్సిన అవసరం ఉందని అన్నారు.అనంతరం విశాఖలో జరిగే 20వ ఆలిండియా పోలీస్ లాన్ టెన్నిస్ చాంపియన్షిప్-2019 కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గోన్నారు.