YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 చిన్నారిపై  రౌడీషీటర్ అత్యాచారం

 చిన్నారిపై  రౌడీషీటర్ అత్యాచారం

 చిన్నారిపై  రౌడీషీటర్ అత్యాచారం
విజయవాడ, డిసెంబర్ 19 
తెలుగు రాష్ట్రాల్లో కామాంధుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. నిత్యం ఏదొక చోట అబలలపై కామాంధులు విరుచుకుపడి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. చిన్నారుల నుంచి ముసలివాళ్ల వరకు వారి పైశాచికానికి బలైపోతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నగరంలో ఓ చిన్నారి అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.విజయవాడ గవర్నర్‌పేటకు చెందిన చిన్న రాజా అనే రౌడీషీటర్ బాలికకు మాయమాటలు చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వదిలేశాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ ఘటన తర్వాత ఏపీ ప్రభుత్వం ‘దిశ’ పేరుతో చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అత్యాచారం కేసులో 21రోజుల్లోనే విచారణ పూర్తిచేసి దోషులకు శిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించింది. అయితే దురదృష్టవశాత్తూ చట్టాన్ని అసెంబ్లీ ఆమోదించిన డిసెంబర్ 13వ తేదీన గుంటూరులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కఠినచట్టం వచ్చిందన్న భయం కామాంధుల్లో ఎక్కడా కనిపించడం లేదని చెప్పడానికి నిత్యం జరుగుతున్న అఘాయిత్యాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

Related Posts