YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చంద్రబాబు పై విజయసాయి సెటైర్లు

చంద్రబాబు పై విజయసాయి సెటైర్లు

చంద్రబాబు పై విజయసాయి సెటైర్లు
విజయవాడ, డిసెంబర్ 19, 
టీడీపీ, చంద్రబాబుపై ట్వీట్ వార్ కొనసాగిస్తున్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. తాజాగా అసెంబ్లీలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని టార్గెట్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా బాబు అబద్దాలు చెప్పడానికి ప్రయత్నించి.. అడ్డంగా దొరికిపోయారని.. స్పీకర్ అప్రమత్తంగా ఉండటంతో బుకాయించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. విజయసాయిరెడ్డి ట్వీట్‌కు వైఎస్సార్‌సీపీ కార్యకర్త అసెంబ్లీ వీడియోను ట్వీట్ చేశారు.వృద్ధ్యాప్య సమస్యల వల్ల చంద్రబాబుకి మతిమరుపు పెరిగిందన్నారు విజయసాయి. శ్రీకాకుళంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశామని అసెంబ్లీలో దబాయించబోయారని.. స్పీకర్ గారు అప్రమత్తంగా ఉండి ఏ లిఫ్ట్ అని ప్రశ్నించడంతో ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేశామని మాట మార్చారని మండిపడ్డారు. చివరికి నవ్వుల పాలయ్యారన్నారు.వృద్ధ్యాప్య సమస్యల వల్ల చంద్రబాబుకు మతిమరుపు పెరిగింది. శ్రీకాకుళంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేశామని అసెంబ్లీలో దబాయించబోయాడు. స్పీకర్ గారు అప్రమత్తంగా ఉండి ఏ లిఫ్ట్ అని ప్రశ్నించడంతో ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి అభివృద్ధి చేశామని మాట మార్చాడు. నవ్వుల పాలయ్యాడు.అమరావతి విషయంలో చంద్రబాబు కంటే కూడా కిరసనాయిలు తెగ ఫీల్ అయినట్టున్నాడు అంటూ ఓ మీడియా సంస్థను విజయసాయి టార్గెట్ చేశారు. పేపర్ నిండా విషపు రాతలేనని.. రాజధానిని వికేంద్రీకరిస్తే హైదరాబాద్ లాభపడుతుందట.. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? కర్నూలు, విశాఖలు అభివృద్ధి చెందొద్దనేది వీళ్ల ఏడుపు అంటూ మండిపడ్డారు.అమరావతి విషయంలో బాబు కంటే కూడా కిరసనాయిలు తెగ ఫీల్ అయినట్టున్నాడు. పేపర్ నిండా విషపు రాతలు పర్చాడు. రాజధానిని వికేంద్రీకరిస్తే హైదరాబాద్ లాభపడుతుందట. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా? కర్నూలు, విశాఖలు అభివృద్ధి చెందొద్దనేది వీళ్ల ఏడుపు.

Related Posts