YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఆడవాళ్లపై ఆగని అఘాయిత్యాలు

ఆడవాళ్లపై ఆగని అఘాయిత్యాలు

ఆడవాళ్లపై ఆగని అఘాయిత్యాలు
విజయవాడ,డిసెంబర్ 20
దిశ చట్టం వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో ఆడవాళ్లపై అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. తాజాగా కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని సుందరయ్య కాలనీలో నివసించే మహిళ భర్తకు దూరంగా ఉంటూ 16ఏళ్ల కుమార్తెతో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది.ఆ యువకుడు అప్పుడప్పుడూ మహిళ ఇంటికి వచ్చిన రాసలీలలు కొనసాగిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ప్రియురాలి కుమార్తెపై అతడి కన్ను పడింది. ఈ నెల 14వ తేదీన ఆమె ఇంటికి వెళ్లగా బాలిక ఒంటరిగా ఉంది. తన కోరిక తీర్చుకోవడానికి అదే సరైన సమయమని భావించిన ఆ కామాంధుడు బాలికను మాటల్లోకి దించాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఆమెతో తాగించాడు. మత్తులోకి జారుకున్న బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.తన పథకం ఫలించడంతో రోజూ ఏదొక సమయంలో బాలిక ఇంటికి వచ్చి ఇదే తరహాలో అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన బాలిక తల్లికి చెప్పడంతో ఆమె తన ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు

Related Posts