YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

రైతుల ఆందోళ నకు జనసేన సంఘీభావం   మహాధర్నాలో పాల్గొన్న  నాగబాబు, నాదెండ్ల మనోహర్

రైతుల ఆందోళ నకు జనసేన సంఘీభావం   మహాధర్నాలో పాల్గొన్న  నాగబాబు, నాదెండ్ల మనోహర్

.రైతుల ఆందోళ నకు జనసేన సంఘీభావం
  మహాధర్నాలో పాల్గొన్న  నాగబాబు, నాదెండ్ల మనోహర్
గుంటూరు డిసెంబర్ 20
ఏపీకి మూడు రాజధానుంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనకు జనసేన సంఘీభావం తెలిపింది. శుక్రవారం మందడం గ్రామంలో జరుగుతున్న మహాధర్నాలో జనసేన పార్టీ నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.  పార్టీలతో తమకు సంబంధం లేదని..తమది రాజధాని పార్టీ మాత్రమే అని జనసేన నేతలకు రైతుల స్పష్టం చేశారు. మంత్రులు ఒక్కోరకంగా మాట్లాడుతున్నారన్నారు. సీఎం జగన్‌కు అమరావతిపై కనీస అవగాహన లేదని మండిపడ్డారు. భూములు ఇచ్చేస్తామని అంత తేలికగా ఎలా మాట్లాడతారని, ప్రతిపక్ష నేతగా నాడు అమరావతికి ఎందుకు మద్దతు తెలిపారని ప్రశ్నించారు. మూడు రాజధానులు పెట్టేందుకు జగన్‌కు ఎవరు అధికారం ఇచ్చారని జనసేన నేతలతో మహిళా రైతులు అన్నారు.

Related Posts