YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

తల్లీ బిడ్డల హత్యకేసు….భర్త ఆరెస్టు

తల్లీ బిడ్డల హత్యకేసు….భర్త ఆరెస్టు

తల్లీ బిడ్డల హత్యకేసు….భర్త ఆరెస్టు
ఒంగోలు డిసెంబర్ 20
ప్రకాశం జిల్లా పేర్నమిట్ట మారెళ్లగుంటపాలెం గ్రామాల మధ్య తల్లీ బిడ్డల హత్యోదంతాన్ని పోలీసులు చేదించారు.తల్లీ బిడ్డలను అత్యంత కిరాతకంగా హతమార్చింది ఎవరనే విషయాన్ని పోలీసులూ సీరియస్‌గా తీసుకున్నారు. జిల్లాను జల్లెడ పట్టి చివరికి అతడిని పట్టుకోగలిగారు. తల్లీబిడ్డల హత్య విషయంలో ఆమె అత్తమామల ప్రమేయం పైనా దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఒంగోలు నగర పరిధిలోని పేర్నమిట్ట శివారు మారెళ్లగుంటవారిపాలెం గ్రామానికి చెందిన రోడ్డులో ఇరవై ఏళ్ల మహిళ, ఏడాది వయసున్న బాలిక దారుణ హత్యకు గురయ్యారు. బాలికను గొంతు కోసి హత్య చేసిన నిందితులు మహిళపై రాళ్లతో దాడి చేసి పాశవికంగా హతమార్చారు. అనంతరం రెండు మృతదేహాలను పెట్రోల్‌ పోసి కాల్చివేశారు. మృతదేహాల ఆనవాళ్లు లేకుండా చేసి పోలీసులను తప్పు దారి పట్టించేందుకు ప్రయత్నించారు. పెద్దకొత్తపల్లి గ్రామ వీఆర్వో షేక్‌ ఆరిఫా ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఎట్టకేలకు పోలీసుల శ్రమ ఫలించింది. కీలకమైన ఆధారం లభించింది. దీంతో తల్లీబిడ్లలను హత్య చేసిన వ్యక్తి ఒంగోలులోని ఒక కార్పొరేట్‌ వైద్యశాలలో పనిచేస్తున్నట్టు గుర్తించారు. అద్దంకి భవానీ సెంటర్‌ వాసి అద్దంకి కోటేశ్వరరావు అలియాస్‌ కోటి అనే వ్యక్తి దుశ్చర్యగా తెలుసుకున్నారు. అతను తన భార్యబిడ్డలను కిరాతకంగా హత్య చేసి ఏమీ తెలియనట్టు తన విధులకు హాజరవుతున్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హత్యకు గురైనవారు కోటేశ్వరరావు భార్య శ్రీలక్ష్మి, అతని కుమార్తె వైష్ణవిగా గుర్తించారు.ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. కుమార్తె తనకు పుట్టలేదని తరచూ వేధింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలోనే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగాయి. దీంతో వారిని అడ్డుతొలగించుకోవాలని పథక రచన చేశాడు. ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related Posts