YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

 రాజధానిపై నివేదికను అందజేసిన జీఎన్ రావు కమిటీ

 రాజధానిపై నివేదికను అందజేసిన జీఎన్ రావు కమిటీ

 రాజధానిపై నివేదికను అందజేసిన జీఎన్ రావు కమిటీ
అమరావతి డిసెంబర్ 20 
రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై అధ్యయనం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ.. సీఎం జగన్‌కు తుది నివేదికను అందజేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎంతో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సమావేశమై నివేదికను అందించింది. ఈ కమిటీ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించింది. రాజధానిపై జరిపిన అధ్యయనంపై ఇప్పటికే ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక అందజేయగా.. తాజాగా తుది నివేదికను సమర్పించింది.విశాఖ, కర్నూలు, అమరావతితో పాటు ఇతర ప్రాంతాల్లో పరిస్థితిని పరిశీలించిన కమిటీ.. ఏ ప్రాంతంలో ఏది అనువుగా ఉంటుందనే కోణంలో అధ్యయనం చేసింది. వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన సుమారు 40వేల వినతులను పరిశీలించింది. ఇటీవల శాసనసభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి మూడు రాజధానులు రావొచ్చంటూ వ్యాఖ్యానించిన నేపథ్యంలో తాజాగా కమిటీ సమర్పించిన తుది నివేదికలో ఏముందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

Related Posts