YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్ దేశీయం విదేశీయం

ఏడుగురు నేవీ అధికారుల ఆరెస్టు

ఏడుగురు నేవీ అధికారుల ఆరెస్టు

ఏడుగురు నేవీ అధికారుల ఆరెస్టు
విశాఖపట్నం డిసెంబర్ 20
ముఖ్యమైన రక్షణ సమాచారాన్ని పాకిస్తాన్ దేశానికి అందజేస్తున్న ఏడుగురు నేవీ అధికారులను ఎఐఎ  శుక్రవారం తెల్లవారుజామున అరెస్టు చేసింది. నేవీ అధికారులు హవాలా బ్రోకర్ ద్వారా సమాచారాన్ని పాకిస్తాన్కు అందజేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.. సముద్ర తీర మార్గ సమాచారాన్ని పాక్కు అందజేసినట్లు అనుమానిస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలు, ఎపి పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో వారిని అరెస్టు చేశారు. నిందితులపై గత కొన్ని నెలలుగా నిఘా పెట్టారు.  అదుపులోకి తీసుకున్న నేవీ అధికారులని ఎన్ఐఏ ఇంటరాగేషన్ చోస్తోంది. ఈ కేసు నేపధ్యంలో ఎన్ఐఏ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా అదుపులోకి తీసుకున్న వారిని విజయవాడలోని ఎన్ఐఎ కోర్టులో హాజరు పరిచారు.

Related Posts