YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

చిరుధాన్యాలకే సైంటిస్టుల ఓటు

చిరుధాన్యాలకే సైంటిస్టుల ఓటు

చిరుధాన్యాలకే సైంటిస్టుల ఓటు
ముంబై, డిసెంబర్ 21,)
వరికి బదులు చిరుధాన్యాలు పండిస్తే బాగుంటుందని ఓ స్టడీ పేర్కొంది. ఈ పంటల్లో పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో పాటు పర్యావరణానికీ మేలు చేస్తాయని వెల్లడించింది. ఇండియన్ స్కూల్ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ‌‌‌‌‌‌‌‌– హైదరాబాద్), ఇండియన్ఇనిస్టిట్యూట్ఆఫ్పబ్లిక్ హెల్త్(ఐఐపీహెచ్– ఢీల్లీ) కలిసి ఈ స్టడీ చేశాయి.  50 ఏళ్లలో భారత్లో తృణధాన్యాల ఉత్పత్తి మూడు రెట్లు పెరగ్గా, అందులో సగం వాటా బియ్యానిదేనని ఈ అధ్యయనం తేల్చింది. ‘‘గ్రీన్ రెవల్యూషన్ విజయవంతమైన తర్వాత వరి సాగు గణనీయంగా పెరిగింది. దేశంలో చిరుధాన్యాలు సాగు చేస్తున్నప్పటికీ, వీటి వాటా చాలా తక్కువ మొత్తంలో ఉంటోంది. సంప్రదాయ పంటలైన మొక్కజొన్న, మిల్లెట్స్ లాంటి చిరుధాన్యాల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వరి పంటతో పోలిస్తే ఇవి పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయి” అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.‘‘చిరుధాన్యాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి తక్కువ నీటితోనే పండుతాయి. ఈ పంటలు ఎదగడానికీ ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు. గ్రీన్హౌస్గ్యాసెస్ను తక్కువ స్థాయిలో విడుదల చేస్తాయి. అదే వరికి ఎక్కువ నీళ్లు అవసరం. ఇప్పటికే ఇండియాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇలాంటి సమయంలో తక్కువ నీటిని తీసుకునే  పంటలను ఎంచుకోవడమే మేలు’’ అని స్టడీ కో‌‌‌‌‌‌‌‌–ఆథర్ యూఎస్లోని డెలావేర్ యూనివర్సిటీకి చెందిన కైలె డేవిస్చెప్పారు. ‘‘మరోవైపు వరి పొలాల్లో నిల్వ ఉండే నీటితో బ్యాక్టీరియా ఫామ్అయి, అది గ్రీన్హౌస్గ్యాసెస్కు కారణమవుతుంది. ఇవి వాతావరణంలో కలవడంతో పర్యావరణం దెబ్బతింటోంది” అని పేర్కొన్నారు.  ‘‘దేశంలో వరి పంటను తగ్గించాల్సిన అవసరముంది.  దానికి బదులు మిల్లెట్స్‌‌ను పండిస్తే  బాగుంటుందని అనుకుంటున్నాం” అని డేవిస్ చెప్పారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఏయే ప్రాంతాలు మిల్లెట్స్ పంటలకు అనుకూలమో తెలియజేస్తామన్నారు. రైతులు చాలా వరకు వరి పంటనే నమ్ముకుంటున్నారన్నారు. వారు ఇతర పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం సబ్సిడీ పథకాలనూ మార్చాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.

Related Posts