టీడీపీ, వైసీపీ.. రైతులకు సమాధానం చెప్పాలి: పురంధేశ్వరి
విజయవాడ డిసెంబర్ 21 :
;: రైతులు ప్రభుత్వానికి మాత్రమే భూములు ఇచ్చారని బీజేపీ నేత పురంధేశ్వరి అన్నారు. టీడీపీ, వైసీపీ.. రైతులకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్రం నిధులు ఇచ్చినా చంద్రబాబు గ్రాఫిక్స్కి పరిమితమయ్యారని మండిపడ్డారు. జీఎన్రావు కమిటీ నివేదిక బహిర్గతం అవలేదు..క్యాబినెట్లో చర్చ జరగాలన్నారు. రైతులకు సమాధానం చెప్పాక 3 రాజధానులపై బీజేపీ స్పందిస్తుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను మొదటి నుంచి బీజేపీ సమర్ధిస్తుందని ఆమె చెప్పారు.