YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ కళ్లు కప్పే ప్రయత్నం చేస్తోంది: మందకృష్ణ

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ కళ్లు కప్పే ప్రయత్నం చేస్తోంది: మందకృష్ణ

ప్రభుత్వం న్యాయ వ్యవస్థ కళ్లు కప్పే ప్రయత్నం చేస్తోంది: మందకృష్ణ
నిజామాబాద్ డిసెంబర్ 21
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ బూటకపు ఎన్‌కౌంటర్ అని, ప్రభుత్వం న్యాయ వ్యవస్థ కళ్లు కప్పే ప్రయత్నం చేస్తోందని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు.. ఈ ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారన జరగాలని, రీపోస్టు మార్టం జరిగితే ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందని అన్నారు. అందుకే ప్రభుత్వం రీ పోస్టుమార్టం అంటే ఒప్పుకోవడం లేదని, అగ్ర కులాల మహిళలకు ఓ న్యాయం, పేద దళితులకు ఓ న్యాయమా? అని మండిపడ్డారు.సుప్రీం వేసిన త్రిసభ్య కమిటీని స్వాగతిస్తున్నామని, న్యాయవ్యవస్థ కళ్లు గప్పి చేసిన దారుణ హత్యలే నిందితుల ఎన్‌కౌంటర్ అని ఆయన దుయ్యబట్టారు. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై రీపోస్టుమార్టం జరగాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసగా 24 వ తేదీన ఇందిరా పార్క్ వద్ద జరిగే మౌన దీక్షను విజయవంతం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు.

Related Posts