క్యాబ్ కు వ్యతిరేకంగా ర్యాలీ
కాకినాడ డిసెంబర్ 21
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ కాకినాడ నగరంలో ముస్లింలు భారీ ర్యాలీ చేపట్టారు. కాకినాడ మెయిన్ రోడ్ లో గల జిల్లా కలెక్టరేట్ వరకు జాతీయ జెండాలను చేతబట్టి, భారీ జాతీయ జెండాను ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. హిందుస్థాన్ జిందాబాద్, మోడీ హటావో దేశ్ బచావో అనే నినాదాలతో ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ఎన్నార్సీ , క్యాబ్ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద నిరసన దీక్షను చేపట్టారు.