YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం తెలంగాణ

హైద్రాబాద్ లో పదేళ్ల బాలిక

హైద్రాబాద్ లో పదేళ్ల బాలిక

హైద్రాబాద్ లో పదేళ్ల బాలిక
హైద్రాబాద్, డిసెంబర్ 23, 
హైదరాబాద్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఘోరం జరిగింది. వైద్యం వికటించి పదేళ్ల బాలిక మృతి చెందింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్‌రావు నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పదేళ్ల బాలిక రమ్య శ్రీకి కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స అనంతరం ఆమె చనిపోయిట్లు డాక్టర్లు తెలిపారు.దీంతో డాక్టర్లు అధిక మోతాదులో ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే రమ్యశ్రీ మరణించిందని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. బాలిక మృతికి కారణమైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts