YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 విజయవాడలో టెన్షన్

 విజయవాడలో టెన్షన్

 విజయవాడలో టెన్షన్
విజయవాడ, డిసెంబర్ 26, 
మూడు రాజధానుల నిర్ణయంపై అమరావతి రైతుల పోరాటం తొమ్మిదో రోజుకు చేరింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసిన రైతులు.. రోజుకో రీతిలో తమ నిరసనల్ని తెలియజేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరులో మహా ధర్నా కొనసాగుతోంది. వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఆందోళణలు, నిరసనలు చేస్తున్నారు.మందడంలో నిరసనల కోసం టెంట్‌ వేస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయానికి వెళ్లే మంత్రులు, అధికారులను అడ్డుకోవద్దని కోరడంతో.. రైతులు సహకరిస్తామనచెప్పారు. రోడ్డుపై కాకుండా పక్కన టెంట్ వేసి ధర్నా చేస్తున్నారు. శుక్రవారం కేబినెట్ సమావేశం ఉండటంతో.. సచివాలయానికి వెళ్లే మార్గాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసుల్ని భారీగా మోహరించారు.. బారికేడ్లు ఏర్పాటు చేశారు.ఇటు విజయవాడలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రకాశం బ్యారేజీపై రూట్ మార్చ్‌కు న్యాయవాదుల పిలుపు ఇవ్వగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. ముందస్తు జాగ్రత్తగా బ్యారేజీపై భారీగా పోలీసుల మోహరించారు. అనుమతి లేకుండా నిరసనలు, దీక్షలు చేస్తే చర్యలు తప్పవని సీపీ ద్వారకా తిరుమలరావు హెచ్చిరించారు. ఇటు ఎంపీ కేశినేని నానిని హౌస్ అరెస్ట్‌లో ఉన్నారు. రైతుల ధర్నాలో పాల్గొనుకుండా ముందుగా హౌస్ అరెస్ట్ చేశారు.. నాని ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరించారు.ఇదిలా ఉంటే అమరావతి పరిరక్షణ సమితి నేతలకు హోం మంత్రి సుచరిత అపాయింట్ మెంట్ నిరాకరించారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని అమరావతి పరిరక్షణ సమితి నేతలు వినతి పత్రాలు ఇస్తున్నారు. హోంమంత్రి సుచరితకు కూడా వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా.. ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో హోంమంత్రి తీరుపై జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పరిరక్షణ సమితి నేతలు ఇప్పటికే చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు.

Related Posts