దేవినేని ఆరెస్టు
గొల్లపూడి డిసెంబర్ 27
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం గొల్లపూడిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. రాజధానిని మార్చొద్దంటూ గొల్లపూడి-1 సెంటర్ వద్ద తెదేపా నేత దేవినేని ఉమ నిరసన చేపట్టారు. రైతులతోపాటు రహదారిపై ఉమ బైఠాయించారు. పోలీసులు దేవినేనితోపాటు పులువురు నేతలను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో నిరసనకారులు పోలీసుల చర్యను నిరసిస్తూ ఆందోళనలను ఉద్ధృతం చేశారు.