YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రాజధానిపై మరో హై పవర్ కమిటీ

 రాజధానిపై మరో హై పవర్ కమిటీ

 రాజధానిపై మరో హై పవర్ కమిటీ
విజయవాడ, డిసెంబర్ 27,
ఏపీ రాజధానిపై మరో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ భేటీలో జీఎన్ రావు కమిటీ రిపోర్ట్‌పై చర్చ జరిపిన మంత్రివర్గం.. బోస్టన్ కన్సల్టెన్సీ రిపోర్ట్ అందాల్సి ఉందని.. ఈ రిపోర్టు వచ్చాక ప్రభుత్వం ఏర్పాటు చేసే హైపవర్ కమిటీ పరిశీలించి.. అధ్యయనం చేసి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఈ హై పవర్ కమిటీలో మంత్రులు, న్యాయ నిపుణులు ఉంటారు. ఈ మేరకు కేబినెట్ సమావేశం తర్వాత సమాచారశాఖ మంత్రి పేర్ని నాని బ్రీఫింగ్ ఇచ్చారు.. రాజధాని అంశంపై క్లారిటీ ఇచ్చారు. జనవరి 3 తర్వాత బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక వచ్చే అవకాశం ఉంది.. ఆ తర్వాతే రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే అమరావతి ప్రాంతంలో జరిగిన అవకతవకలపై మంత్రి మండలి ఉప సంఘం నివేదిక ఇచ్చినట్లు సమాచారశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగినట్లు గుర్తించామని.. సీఆర్డీఏ పరిధిలో అవినీతి విచారణ కోసం.. న్యాయ నిపుణుల సలహా తీసుకొని సీబీఐ, సీఐడీ, లోకాయుక్తకు అప్పగించాలా అన్నదానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.కేబినెట్ మిగిలిన నిర్ణయాల విషయానికి వస్తే.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అలాగే 412 కొత్త 108 వాహనాలు.. 656 కొత్త 104 వాహనాలు కొనుగోలు చేయాలని తీర్మానించారు. 341శాశ్వత పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు.. పసుపు, మిర్చి, ఉల్లి, చిరు ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.ఇటు మచిలీపట్నం పోర్టును ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించాలని కేబినెట నిర్ణయం తీసుకుంది. రూ.10009వేల కోట్ల అంచనాలతో రామాయపట్నం పోర్ట్ నిర్మించాలని.. దుగరాజు పట్నం పోర్ట్ బదులు రామాయపట్నం పోర్టు నిర్మించడానికి కేబినెట్ ఓకే చెప్పింది. పోర్టు నిర్మాణంపై అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రెండు పోర్టులకు డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Related Posts