YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలకు గులాబీ సిద్ధం :కేటీఆర్

మున్సిపల్ ఎన్నికలకు గులాబీ సిద్ధం :కేటీఆర్

మున్సిపల్ ఎన్నికలకు గులాబీ సిద్ధం :కేటీఆర్
హైద్రాబాద్, డిసెంబర్ 27, 
రాష్ట్రంలో త్వరలో జరిగే పురపాలక ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని మంత్రి, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిగా 60 లక్షల మంది గులాబీ సైనికులున్నారని కేటీఆర్ అన్నారు. వీరంతా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని వెల్లడించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘గత ఐదేళ్ల పాలనలో మేం ఎక్కడా నేలవిడిచి సాము చేయలేదు. ప్రజలు అభీష్టానికి అనుగుణంగా కనీస మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించేలా పనిచేశాం. కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం, తెలంగాణ మున్సిపల్‌ చట్టం తీసుకొచ్చాం. ఈ పంచాయతీ రాజ్‌ చట్టం తీసుకొచ్చాక 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది.’’ అని కేటీఆర్ అన్నారు.‘చరిత్రలో ఏ ప్రభుత్వమూ ఇవ్వనంతగా మున్సిపాలిటీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. తెలంగాణలోని మొత్తం 141 మున్సిపాలిటీలకు గాను ఎక్కువ భాగంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించే అజెండాతోనే మేం ముందుకెళ్తున్నాం. ఆ అజెండాను బలపరిచే విధంగా మా పార్టీకి ప్రజలు మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా. మా పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష’’ అని కేటీఆర్ చెప్పారు.మున్సిపాలిటీల్లో పరిస్థితులపై పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా పార్టీ ఇంఛార్జిలను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ నెలాఖరులోపు నివేదిక అందాలని సూచించారు. మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ ఛైర్మన్ల ఎంపిక అధిష్ఠానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు కలిసివచ్చే చోట ఉద్యమకారులకు అవకాశమివ్వాలని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే, జనవరి 1 లేదా 2న ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ప్రజల అవసరాలు తీర్చడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేస్తోంది. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందుతున్నాయి. కొత్తగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాలను తీసుకొచ్చాం. తెలంగాణ ఏర్పడ్డాక ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో బ్రహ్మాండమైన విజయం సాధించాం. విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడినట్లుగా ఉంది. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్‌ భయపడుతోంది. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని' పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణభవన్‌లో ఇవాళ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు.'మేము నేల విడిచి సాము చేయడం లేదు. ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ మాకు కట్టబెట్టారు. 2014లో 63 సీట్లు గెలిచిన టీఆర్‌ఎస్‌..2018లో 88సీట్లలో గెలిచింది. తిరుగులేని రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్‌ అవతరించింది. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఎన్నికలకు టీఆర్‌ఎస్‌ పార్టీ సిద్ధంగా ఉంది. పల్లె ప్రగతి తరహాలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం చేపడుతున్నాం. పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం వచ్చిన తర్వాత గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా మున్సిపాలిటీలకు నిధులిచ్చాం. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకు పోతాం. ఆరు లక్షల మందికి కేసీఆర్‌ కిట్‌ అందించాం. 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం. ప్రజలకు, పార్టీకి మధ్య వారధిగా 60 లక్షల మంది గులాబీ సైనికులున్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తాం. 95శాతం పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తయిందని' మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

Related Posts