YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఐదు హైలెవెల్ బ్రిడ్జి లను ప్రారంభించిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

ఐదు హైలెవెల్ బ్రిడ్జి లను ప్రారంభించిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

ఐదు హైలెవెల్ బ్రిడ్జి లను ప్రారంభించిన ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు  డిసెంబర్ 28
నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం లోని కందుకూరు నియోజకవర్గంలో శుక్రవారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి5 హైలెవెల్ బ్రిడ్జి లను ప్రారంభించారు. మొదటగా గుడ్లూరు మండలం లోని గుండ్లపాలెం లో 3 కోట్ల 9 లక్షల  రూపాయలతో నిర్మించిన ఈ బ్రిడ్జి ని స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డితో కలిసి  ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత లింగసముద్రం మండలం లోని హైలెవెల్ బ్రిడ్జి ని ప్రారంభించారు .ఈ బ్రిడ్జి  ఒక కోటి 92 లక్షల  రూపాయలతో నిర్మించారు. ఓలేటి వారి పాలెం మండలంలోని కొండ సముద్రం  హైలెవెల్ బ్రిడ్జి ని ప్రారంభించారు ఈ బ్రిడ్జి ని నాలుగు కోట్ల 5 లక్షల రూపాయలతో  నిర్మించారు. ఆ తర్వాత వివి పాలెం మండలం లోని బి అగ్రహారం హైలెవెల్ బ్రిడ్జి ని ప్రారంభించారు .ఈ బ్రిడ్జిని మూడు కోట్ల 94 లక్షల రూపాయల తో నిర్మించారు. అనంతరం వి.వి పాలెం మండలంలోని గుజ్జర్ల వాగుపై హైలెవెల్ బ్రిడ్జి ని ప్రారంభించారు .ఈ బ్రిడ్జిని కోటి 97 లక్షల రూపాయలతో నిర్మించారు. ఈ కార్యక్రమాల్లో విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి స్వర్ణ వెంకయ్య, సుధాకర్ రెడ్డి  , పాముల హరి ,డాక్టర్ సునీల్  నరసింహారావు  తదితరులు పాల్గొన్నారు.

Related Posts